శవ సంస్కారాలు జరుగుతుండగా దాడి.. 18 మంది హత్య

- April 25, 2018 , by Maagulf
శవ సంస్కారాలు జరుగుతుండగా దాడి.. 18 మంది హత్య

నైజీరియాలో దారుణం జరిగింది. మంగళవారం కొంతమంది బెన్యూ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో ఉన్న స్థానిక చర్చిపై దాడి చేసి ఇద్దరు పాస్టర్లు సహా కనీసం 18 మందిని పొట్టన పెట్టుకున్నారు. గొర్రెల కాపర్లుగా అనుమానిస్తున్న దాదాపు 30 మంది ఆయుధాలతో బలోమ్‌ వర్గంపై దాడి చేశారు. అంతిమ సంస్కారం జరుగుతున్న ప్రదేశంపై విరుచుకుపడిన దుండగులు అక్కడే ప్రార్థనలు చేయిస్తున్న ఇద్దరు పాస్టర్లను కూడా హత్య చేశారని బెన్యూ రాష్ట్ర పోలీసు కమిషనర్‌ చెప్పారు. మొత్తం 18 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com