కొత్త బస్ రూట్ని ప్రారంభించిన మవసలాత్
- April 26, 2018మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, కొత్త మస్కట్ - ఇబ్రి - బురైమి రూట్ని ప్రారంభించింది. ఏప్రిల్ 27 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మరింతగా విస్తరించే క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త రూట్స్ని ప్రారంభిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్లు అత్యంత భద్రతతో కూడుకున్నవని అధికారులు తెలిపారు. అల్ అజైబా స్టేషన్, మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, అల్ సహవా టవర్, నిజ్వా మార్కెట్, బాహ్లా మార్కెట్, ఇబ్రి, ధనక్ రౌండెబౌట్, సునయ్నాహ్ మీదుగా బురైమి చేరుకుంటాయి. టిక్కెట్లను బస్లోగానీ, కంపెనీ కార్యాలయంలోగానీ పొందవచ్చు. మస్కట్ - ఇబ్రి - బురైమి లైన్లో రోజుకి రెండు ట్రిప్స్ ఈ బస్సులు నడుస్తాయి. తొలి బస్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 నిమిషాలకు చేరుకుంటుంది. బురైమీ చేరుకునేసరికి సమయం 4 గంటలవుతుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్