శ్రీలంకలో రెండు రోజులు మద్యం, మాంసం నిషేధం...
- April 27, 2018తొలిసారిగా ఓ రెండు రోజులు మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుద్ధుని జయంతి వేడుకల్లో భాగంగా రెండు రోజులపాటు నిర్వహించే వెషాక్ ఫెస్టివల్ ఏప్రిల్ 29వ తేది నుంచి ప్రారంభం కానుంది. ఈ రెండు రోజులపాటు సూపర్ మార్కెట్లు, హోటళ్లలో మాంసం, మద్యంను విక్రయించరాదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా బుద్ధ పూర్ణిమ సమయంలో శ్రీలంకలో బార్లు, రెస్టారెంట్లు మూసివేస్తారు. అయితే తొలిసారిగా మాంసం విక్రయంపై కూడా ఆంక్షలు విధించింది శ్రీలంక ప్రభుత్వం.
అహింస అనేది బుద్ధుని సిద్ధాంతం కాబట్టి.. ఆయన జయంతి రోజున మాంస విక్రయాలు చేయడం కూడా అనైతికమని భావించిన శ్రీలంక ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మాంసం దుకాణాలతో పాటు సూపర్ మార్కెట్లలో లభించే ప్యాకేజ్డ్ మీట్ విక్రయాలపై కూడ ఈ రెండు రోజులు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ కొత్త పద్ధతిని పాటించనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్