దుబాయిలో తాండ్ర(జి) వాసి మృతి
- April 29, 2018తాండ్ర(జి)(సారంగాపూర్): తాండ్ర(జి) గ్రామానికి చెందిన మహ్మద్ తాజొద్దిన్(22) దుబాయిలో గుండె పోటుతో మృతి చెందారు. ఈ నెల 26న విధులు ముగించుకుని తన గదికి రాగా..తెల్లవారే సరికి నిద్రలోనే ప్రాణాలు విడిచారు. స్నేహితులు ద్వారా ఈ విషయం తెలిసిందని తల్లిదండ్రులు ఆదివారం వివరించారు. తాజొద్దిన్ది నిరుపేద కుటుంబం కావడంతో ఉపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయి వెళ్లారు. తండ్రి అన్నుసాబ్, పెద్దన్న రాజాక్ మృతి చెందారు. మరో అన్న ఇబ్రహీమ్తో కలిసి తాజొద్దిన్ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంతలో యువకుడు గుండె పోటుతో మృతి చెందడం ఆ కటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. మృతుడికి తల్లి, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. ప్రభుత్వం చొరవ చూపి కుమారుడి మృతదేహం త్వరగా ఇంటికి వచ్చేలా చూడాలని తల్లి నన్నుబి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ