రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్లో పాల్గొన్న 17 స్కూళ్ళు
- December 05, 2015
గత నెలలో దర్బ్ అల్ సలామా అనే రోడ్ సేఫ్టీ ఇనీషియేటివ్, కొత్త సీజన్ గత నెలలో అల్ షమాల్ స్పోర్ట్స్ క్లబ్ మరియు అల్ తుకిరాహ్ యూత్ సెంటర్లో నిర్వహించింది. రస్ లఫ్పాన్ కమ్యూనిటీ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా లాంఛ్ అయిన ఈ ప్రోగ్రామ్ 17 స్కూల్స్కి చెందిన 828 మంది విద్యార్థిల్ని ఆకర్షించింది. ఈ కార్యక్రమం ద్వారా ఖతార్లో చాలా మార్పులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. 14 నుంచి 21 ఏళ్ళ మధ్య వయస్కులైన మోటరిస్టుల్ని టార్గెట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటిదాకా ఈ కార్యక్రమంలో 12 వేల మందికి పైగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్ని నివారించడం కోసం వాహనదారులు రోడ్లపై హెచ్చరికల్ని ఫాలో అవుతూ, నిబంధనల్ని పరిగణనలోకి తీసుకునేలా అవగాహనా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఖతార్ రెడ్ క్రిసెంట్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ డిపార్ట్మెంట్స్ సేఫ్ జర్నీ ఇనీషియేటివ్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









