హైదరాబాద్ లో తనిఖీలతో నరకం చూపిస్తున్న పోలీసులు....
- May 02, 2018
హైదరాబాద్:వేళాపాలా లేని డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు హైదరాబాద్ వాసులకు నరకం చూపిస్తున్నాయి. అసలే ఇరుకు రోడ్లు.. ఆపై పీక్ ట్రాఫిక్ టైం. ఈ సమయంలో రోజూ డ్రంకెన్ డ్రైవ్లు ఏర్పాటు చేస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ యూసుఫ్ గూడలో రోజూ రాత్రి 7 గంటల నుంచి 9 గంటలకు వరకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం వల్లే.. నిత్యం వాహనదారులు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంటున్నారు. అంతే కాకుండా ఇక్కడే మెట్రో స్టేషన్ ను ఏర్పాటు చేయడంతో రోడ్డు మరీ చిన్నదిగా మారిపోయింది. పోలీసులు బారికేడ్లు పెట్టి.. తనిఖీలు చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆఫిస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో రోజూ ఇక్కడ ట్రాఫిక్ నిలిచి పోవడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు రాత్రి 9 గంటల తరువాత నిర్వహించాలని కోరుతున్నారు.అయితే పోలీసులు మాత్రం తమ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నామని అంటున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు







