హైదరాబాద్ లో తనిఖీలతో నరకం చూపిస్తున్న పోలీసులు....
- May 02, 2018
హైదరాబాద్:వేళాపాలా లేని డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు హైదరాబాద్ వాసులకు నరకం చూపిస్తున్నాయి. అసలే ఇరుకు రోడ్లు.. ఆపై పీక్ ట్రాఫిక్ టైం. ఈ సమయంలో రోజూ డ్రంకెన్ డ్రైవ్లు ఏర్పాటు చేస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ యూసుఫ్ గూడలో రోజూ రాత్రి 7 గంటల నుంచి 9 గంటలకు వరకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం వల్లే.. నిత్యం వాహనదారులు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంటున్నారు. అంతే కాకుండా ఇక్కడే మెట్రో స్టేషన్ ను ఏర్పాటు చేయడంతో రోడ్డు మరీ చిన్నదిగా మారిపోయింది. పోలీసులు బారికేడ్లు పెట్టి.. తనిఖీలు చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆఫిస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో రోజూ ఇక్కడ ట్రాఫిక్ నిలిచి పోవడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు రాత్రి 9 గంటల తరువాత నిర్వహించాలని కోరుతున్నారు.అయితే పోలీసులు మాత్రం తమ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నామని అంటున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









