మొబైల్ ఫోన్ స్కామ్: అబుదాబీలో 11 మంది అరెస్ట్
- May 04, 2018
అబుదాబీ:11 మంది సభ్యులుగల ముఠాని అబుదాబీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ పంపి, వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకుని, స్కామ్కి పాల్పడుతున్నట్లుగా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. విలువైన బహుమతులు గెల్చుకున్నారంటూ అమాయకులకు మెసేజ్లు పంపి, వారి నుంచి బ్యాంక్ డిటెయిల్స్ తీసుకుని, నిందితులు దోపిడీకి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అల్ అయిన్ పోలీస్ డైరెక్టరేట్ - క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ డైరెక్టర్ కల్నల్ ముబారక్ అల్ సబౌషి మాట్లాడుతూ, తమ బృందం దుబాయ్ పోలీస్తో కలిసి 11 మంది నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టయినవారంతా ఆసియా జాతీయులే. వారి నుంచి క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ రిసీప్ట్స్, చెక్బుక్స్, ఫోన్ సిమ్కార్డ్స్, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారనీ, వారందర్నీ పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించామని కల్నల్ అల్ సబౌషి చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







