మొబైల్ ఫోన్ స్కామ్: అబుదాబీలో 11 మంది అరెస్ట్
- May 04, 2018
అబుదాబీ:11 మంది సభ్యులుగల ముఠాని అబుదాబీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ పంపి, వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకుని, స్కామ్కి పాల్పడుతున్నట్లుగా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. విలువైన బహుమతులు గెల్చుకున్నారంటూ అమాయకులకు మెసేజ్లు పంపి, వారి నుంచి బ్యాంక్ డిటెయిల్స్ తీసుకుని, నిందితులు దోపిడీకి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అల్ అయిన్ పోలీస్ డైరెక్టరేట్ - క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ డైరెక్టర్ కల్నల్ ముబారక్ అల్ సబౌషి మాట్లాడుతూ, తమ బృందం దుబాయ్ పోలీస్తో కలిసి 11 మంది నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టయినవారంతా ఆసియా జాతీయులే. వారి నుంచి క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ రిసీప్ట్స్, చెక్బుక్స్, ఫోన్ సిమ్కార్డ్స్, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారనీ, వారందర్నీ పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించామని కల్నల్ అల్ సబౌషి చెప్పారు.
తాజా వార్తలు
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!







