అమెరికా:హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్ల కేసులో ఫెడరల్ కోర్టు కీలక తీర్పు...
- May 04, 2018
అమెరికాలోని కాన్సాస్లో గతేడాది హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్ల కేసులో ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితుడు ఆడం ప్యూరింటన్కు జీవిత ఖైదు విధించింది. చంపాలన్న ఉద్దేశంతోనే ఆరోజు అతను తుపాకీతో బార్లోకి ప్రవేశించినట్టు విచారణలో తేలడంతో దోషికి కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది. చాలా మందిని చంపాలన్న ప్లాన్తోనే ఆరోజు ఆడం ప్యూరింటన్ ఉన్నాడని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పు పట్ల శ్రీనివాస్ భార్య సునయన హర్షం వ్యక్తం చేశారు. తన భర్తను తిరిగి తీసుకురాలేకపోయినా, నిందితుడికి కఠినమైన శిక్ష విధించడం ద్వారా ఇకపై ఇలాంటి చర్యలకు దిగాలనుకునే వాళ్లకు గట్టి మెసెజ్ పంపినట్టయ్యిందనన్నారు. కేసు విచారణ వేగంగా పూర్తి చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
32 ఏళ్ల ఇండియన్ టెక్కీ శ్రీనివాస్ ఫిబ్రవరి 22న తన స్నేహితుడితో కలిసి బార్కు వెళ్లిన సమయంలో అక్కడ జాత్యాహంకార వ్యాఖ్యలు చేస్తూ ఆడం ప్యూరింటన్ కాల్పులు జరిపాడు. ఈ దేశం విడిచి వెళ్లిపోండి అని పెద్దగా అరుస్తూ ఫైరింగ్ మొదలుపెట్టాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అదృష్టవశాత్తూ అక్కడే ఉన్న శ్వేతజాతీయుడు ఆడంను అడ్డుకోవడంతో మరికొందరికి ప్రాణాపాయం తప్పింది. ఈ రేసిజం ఘటన అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఐతే, ఇలాంటివి ఉపేక్షించేది లేదని పౌరుల భద్రతకు భరోసా కల్పిస్తామని US ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. కేసు విచారణను కూడా వేగంగా పూర్తి చేసింది. చివరికిప్పుడు దోషికి జీవిత ఖైదు పడడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







