కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో 'ఇండియా డే'
- May 05, 2018
ఈనెల ఎనిమిదో తేదీ నుంచి 71వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం కానున్నాయి. ఈ విషయం తెలిసింది. అవి ఈనెల 19వ తేదీ వరకూ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భారత్, ఫ్రెంచ్ సినీ పరిశ్రమలు కొన్ని ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావడానికి ఇరుదేశాల దౌత్యకార్యాలయాలు వ్యూహాలు రచించాయి. అందులో భాగంగా ఈనెల 11వ తేదీన కేన్స్లో 'ఇండియా డే' పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహించడం ఇదే మొదటసారి. ఈ విషయాన్ని ఫ్రెంచ్ దౌత్య కార్యాలయం శనివారం వెల్లడించింది. ఒకే తరహా సినీ ప్రాజెక్టులపై రెండు దేశాల భాగస్వామ్యం ఉండేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొంది. 'ఇండియా డే' పేరిట నిర్వహించే ఈ కార్యక్రమంలో మన దేశం తరఫున నందతాదాస్ దర్శకత్వం వహించిన తన బయోపిక్ 'మంటో' ప్రదర్శించబోతున్నారు. ఇందులో జవాజుద్దీనీ సిద్ధిఖీ టైటిల్ రోల్ పోషించారు. దీంతో ధనుష్ హీరోగా రూపొందిన హాలీవుడ్లో డెబ్యూ చిత్రం 'ది ఎక్స్ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకిర్' చిత్రాన్నీ ప్రదర్శించబోతున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ ఏడాది సోనమ్ కపూర్ భారతదేశం తరఫున పాల్గొననుంది. దీపికా పదుకొనే, ఐశ్వర్యరారు వంటి వారు కూడా రెడ్కార్పెట్ మీద హోయలొలికించనున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







