కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్ లో 'ఇండియా డే'

- May 05, 2018 , by Maagulf
కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్ లో 'ఇండియా డే'

ఈనెల ఎనిమిదో తేదీ నుంచి 71వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రారంభం కానున్నాయి. ఈ విషయం తెలిసింది. అవి ఈనెల 19వ తేదీ వరకూ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భారత్‌, ఫ్రెంచ్‌ సినీ పరిశ్రమలు కొన్ని ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావడానికి ఇరుదేశాల దౌత్యకార్యాలయాలు వ్యూహాలు రచించాయి. అందులో భాగంగా ఈనెల 11వ తేదీన కేన్స్‌లో 'ఇండియా డే' పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహించడం ఇదే మొదటసారి. ఈ విషయాన్ని ఫ్రెంచ్‌ దౌత్య కార్యాలయం శనివారం వెల్లడించింది. ఒకే తరహా సినీ ప్రాజెక్టులపై రెండు దేశాల భాగస్వామ్యం ఉండేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొంది. 'ఇండియా డే' పేరిట నిర్వహించే ఈ కార్యక్రమంలో మన దేశం తరఫున నందతాదాస్‌ దర్శకత్వం వహించిన తన బయోపిక్‌ 'మంటో' ప్రదర్శించబోతున్నారు. ఇందులో జవాజుద్దీనీ సిద్ధిఖీ టైటిల్‌ రోల్‌ పోషించారు. దీంతో ధనుష్‌ హీరోగా రూపొందిన హాలీవుడ్‌లో డెబ్యూ చిత్రం 'ది ఎక్స్‌ట్రార్డనరీ జర్నీ ఆఫ్‌ ది ఫకిర్‌' చిత్రాన్నీ ప్రదర్శించబోతున్నారు. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ ఏడాది సోనమ్‌ కపూర్‌ భారతదేశం తరఫున పాల్గొననుంది. దీపికా పదుకొనే, ఐశ్వర్యరారు వంటి వారు కూడా రెడ్‌కార్పెట్‌ మీద హోయలొలికించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com