పాక్ బొగ్గు గనుల్లో ప్రమాదం.. 18 మంది దుర్మరణం

- May 05, 2018 , by Maagulf
పాక్ బొగ్గు గనుల్లో ప్రమాదం.. 18 మంది దుర్మరణం

పాకిస్థాన్‌:పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో శనివారం రెండు వేర్వేరు బొగ్గు గనులు కూలిపోయిన దుర్ఘటనల్లో 18 మంది మృతి చెందారు. తొలుత ప్రావిన్స్‌ రాజధాని క్వెట్టాకు సమీపంలోని మార్వార్‌ ప్రాంతంలో గ్యాస్‌ పేలుడు వల్ల బొగ్గు గని కూలిపోవడంతో 16 మంది చనిపోయారని, నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరో కార్మికుడు లోపల చిక్కుకున్నట్లు వెల్లడించారు. పాకిస్థాన్‌ ఖనిజాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న బొగ్గు గనిలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతి శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురిని కాపాడేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com