బడిగాంలో భారీ ఎన్కౌంటర్..
- May 06, 2018
జమ్మూ-కశ్మీరులోని షోపియాన్ జిల్లా బడిగాం వద్ద భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల కంటే ముందు లొంగిపోవాలని ఉగ్రవాదులకు బలగాలు అప్పీల్ చేశాయి. బలగాల మాటను వినకుండా ఉగ్రవాదులు కాల్పులు జరిపాయి. దీంతో భద్రతా దళాలు కూడా కాల్పులు జరిపి ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
జైనపొర ప్రాంతంలోని బడిగామ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా సిబ్బందిని చూసిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని తెలిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు దాడి చేసినట్లు చెప్పారు.
సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ శైలేంద్ర మిశ్రా మాట్లాడుతూ తాము ఉగ్రవాదులను లొంగిపోవాలని కోరామని, కానీ ఫలితం లేకపోయిందని చెప్పారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని, ఎందరు ఉగ్రవాదులు ఉన్నారో చెప్పలేమని తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







