బడిగాంలో భారీ ఎన్కౌంటర్..
- May 06, 2018
జమ్మూ-కశ్మీరులోని షోపియాన్ జిల్లా బడిగాం వద్ద భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల కంటే ముందు లొంగిపోవాలని ఉగ్రవాదులకు బలగాలు అప్పీల్ చేశాయి. బలగాల మాటను వినకుండా ఉగ్రవాదులు కాల్పులు జరిపాయి. దీంతో భద్రతా దళాలు కూడా కాల్పులు జరిపి ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
జైనపొర ప్రాంతంలోని బడిగామ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా సిబ్బందిని చూసిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని తెలిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు దాడి చేసినట్లు చెప్పారు.
సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ శైలేంద్ర మిశ్రా మాట్లాడుతూ తాము ఉగ్రవాదులను లొంగిపోవాలని కోరామని, కానీ ఫలితం లేకపోయిందని చెప్పారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని, ఎందరు ఉగ్రవాదులు ఉన్నారో చెప్పలేమని తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







