సంచలనం : శ్మశానంలో సాహసం..

- May 06, 2018 , by Maagulf
సంచలనం : శ్మశానంలో సాహసం..

అత్యంత పురాతన స్మశానంలో సాహసయాత్ర చేశాడో వ్యక్తి. కానీ అనూహ్యంగా దెయ్యం లేచి పరుగెత్తడంతో ప్రాణభయంతో పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంగ్లండ్‌ కు చెందిన ఫెర్గూసన్‌ అనే వ్యక్తి హాంట్స్‌ అనే ప్రాంతంలోని సెయింట్‌ మెరీ చర్చి వద్దకు వెళ్ళాడు. చర్చి పక్కన  800 ఏళ్ల నాటి పురాతన స్మశానం ఉంది. గత కొద్ది రోజుల నుంచి అక్కడో ఏదో ఏదోజరుగుతుందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకోవడానికి అర్ధరాత్రి సమయాన స్మశానంలోకి వెళ్ళాడు ఫెర్గూసన్‌.  పరిసర ప్రాంతాలను తన కెమరాతో చిత్రీకరిస్తున్నాడు. ఇంతలో ఒక దెయ్యం ఒక్కసారిగా లేచి పరుగెత్తసాగింది.దీంతో నిర్గాంతపోయిన ఫెర్గూసన్‌ ప్రాణభయంతో పరుగులు తీశాడు. ఈ వీడియో ను సోషల్ మీడియాలో  షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్ గా మారింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com