ఆఫ్ఘనిస్తాన్ లో ఏడుగురు భారతీయుల అపహరణ
- May 06, 2018
కాబూల్:ఆఫ్ఘనిస్తాన్లో ఏడుగురు భారతీయులు అపహరణకు గురయ్యారు. ఉత్తర బగ్లాన్ ప్రావిన్స్లో ఓ పవర్ ప్లాంట్లో వీరంతా పనిచేస్తున్నారు. వీరితోపాటు ఓ అఫ్గాన్ జాతీయుడిని కుడా దుండగులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.
పవర్ప్లాంట్కు ఇంజినీర్లు మినీ బస్సులో వెళ్తుండగా దుండగులు తుపాకులు చూపించి అడ్డుకున్నారని.. అఫ్గాన్ జాతీయుడైన వాహనం డ్రైవర్తోపాటు ఏడుగురు ఇంజినీర్లను అపహరించారని బగ్లాన్ పోలీసులు తెలిపారు. కాబుల్లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పవర్ప్లాంట్లో వీరంతా పనిచేస్తున్నారని పేర్కొంది.
భారత ఇంజినీర్లను విడిపించేందుకు చర్యలు ప్రారంభించినట్లు భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ఇంతవరకూ ఏ సంస్థ ప్రకటించుకోలేదని చెప్పారు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్లో దాదాపు 150 మంది భారత ఇంజినీర్లు, నిపుణులు పనిచేస్తున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







