ఆఫ్ఘనిస్తాన్ లో ఏడుగురు భారతీయుల అపహరణ

- May 06, 2018 , by Maagulf
ఆఫ్ఘనిస్తాన్ లో ఏడుగురు భారతీయుల అపహరణ

కాబూల్‌:ఆఫ్ఘనిస్తాన్లో ఏడుగురు భారతీయులు అపహరణకు గురయ్యారు. ఉత్తర బగ్లాన్‌ ప్రావిన్స్‌లో ఓ పవర్‌ ప్లాంట్‌లో వీరంతా పనిచేస్తున్నారు. వీరితోపాటు ఓ అఫ్గాన్‌ జాతీయుడిని కుడా దుండగులు కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది.

పవర్‌ప్లాంట్‌కు ఇంజినీర్లు మినీ బస్సులో వెళ్తుండగా దుండగులు తుపాకులు చూపించి అడ్డుకున్నారని.. అఫ్గాన్‌ జాతీయుడైన వాహనం డ్రైవర్‌తోపాటు ఏడుగురు ఇంజినీర్లను అపహరించారని బగ్లాన్‌ పోలీసులు తెలిపారు. కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పవర్‌ప్లాంట్‌లో వీరంతా పనిచేస్తున్నారని పేర్కొంది.

భారత ఇంజినీర్లను విడిపించేందుకు చర్యలు ప్రారంభించినట్లు భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ఇంతవరకూ ఏ సంస్థ ప్రకటించుకోలేదని చెప్పారు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో దాదాపు 150 మంది భారత ఇంజినీర్లు, నిపుణులు పనిచేస్తున్నారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com