ఆఫ్ఘనిస్తాన్ లో ఏడుగురు భారతీయుల అపహరణ
- May 06, 2018
కాబూల్:ఆఫ్ఘనిస్తాన్లో ఏడుగురు భారతీయులు అపహరణకు గురయ్యారు. ఉత్తర బగ్లాన్ ప్రావిన్స్లో ఓ పవర్ ప్లాంట్లో వీరంతా పనిచేస్తున్నారు. వీరితోపాటు ఓ అఫ్గాన్ జాతీయుడిని కుడా దుండగులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.
పవర్ప్లాంట్కు ఇంజినీర్లు మినీ బస్సులో వెళ్తుండగా దుండగులు తుపాకులు చూపించి అడ్డుకున్నారని.. అఫ్గాన్ జాతీయుడైన వాహనం డ్రైవర్తోపాటు ఏడుగురు ఇంజినీర్లను అపహరించారని బగ్లాన్ పోలీసులు తెలిపారు. కాబుల్లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పవర్ప్లాంట్లో వీరంతా పనిచేస్తున్నారని పేర్కొంది.
భారత ఇంజినీర్లను విడిపించేందుకు చర్యలు ప్రారంభించినట్లు భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ఇంతవరకూ ఏ సంస్థ ప్రకటించుకోలేదని చెప్పారు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్లో దాదాపు 150 మంది భారత ఇంజినీర్లు, నిపుణులు పనిచేస్తున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







