టీడీపీ నేత చమన్ మృతి...
- May 07, 2018
అనంతపురం జెడ్పీ మాజీ చైర్మన్ చమన్ మృతి చెందారు. గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఆకస్మికంగా కన్ను మూశారు. పరిటాల రవి అనుచరుడుగా ఫేమస్ అయిన చమన్.. ఆయన మృతి తర్వాత చాలా కాలం అజ్ఞాతంలో గడిపారు. రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత టీడీపీలో కీలకంగా పనిచేస్తున్నారు.
పరిటాల రవికి ప్రాణ స్నేహితుడు, ప్రధాన అనుచరుడైన 58 ఏళ్ల చమన్ మరణ వార్తను టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పరిటాల రవీంద్ర కుమార్తె పరిటాల స్నేహలత వివాహ వేడుక కోసం పర్యవేక్షణ కోసం మూడు రోజులుగా వెంకటాపురంలోనే ఉన్న చమన్కు ఇవాళ ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మంత్రి పరిటాల సునీత వెంటనే చమన్ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ చమన్ మృతి చెందారు.
పరిటాల రవికి అత్యంత సన్నిహితుడైన చమన్ 2014 నుంచి 2017 మే వరకు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్గా పని చేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఫ్యాక్షన్ హత్యల కారణంగా చమన్ దాదాపు ఎనిమిది సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు. 2012 సంవత్సరంలో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం.. పరిటాల సునీత మంత్రి అవ్వడంతో.. తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున చమన్ జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల తరువాత తన పదవికీ రాజీనామా చేశారు.
పరిటాలకు చమన్ అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరించడంతో.. సొంత మనిషిలా చూసుకునేవారు రవి. చమన్ చికిత్స పొందుతున్నప్పుడు ఆసుపత్రిలోనే ఉన్న మంత్రి పరిటాల సునీత.. ఆయన మృత దేహాన్ని చూసి సొమ్మసిల్లి పడిపోయారు. చమన్ను సొంత తమ్ముడిగా సునీత భావిస్తారు.. అందుకే ఆయన మరణ వార్త విని ఆమె షాక్ తిన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







