దర్శకురాలిగా మారిన తమిళ హీరోయిన్
- May 07, 2018
చెన్నై: 'కలాబకాదలన్' చిత్రంలో ఆర్యకు మరదలిగా కనిపించి ఆకట్టుకుంది నటి అక్షయ. ఆ తర్వాత విజయ్కాంత్ నటించిన 'ఎంగల్ ఆసాన్', 'ఓసై' తదితర చిత్రాల్లో నటించారు. నటిగా మెరిసిన ఆమె చాలా గ్యాప్ తర్వాత దర్శకురాలిగా తెరపై అడుగు పెడుతున్నారు. ఏబీ క్రియేషన్స్ బ్యానర్పై టి.బాలచందర్ నిర్మిస్తున్న 'యాళి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆమె కథానాయికగానూ నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో తమన్ ఊర్వశి, మనోబాలా ప్రధాన పాత్రలు పోషించారు. యాక్షన్కింగ్ అర్జున్ కీలక పాత్రలో మెరవనున్నారు. చిత్రానికి దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ప్లే, మాటలను అక్షయ సమకూర్చారు.
ఈ సినిమా గురించి అక్షయ మాట్లాడుతూ.. తమిళ చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకులకు ప్రత్యేక స్థానముంది. వారి జాబితాలో నేను కూడా చేరతాననే నమ్మకం ఉంది. ఇది ఒక రొమాంటిక్, థ్రిల్లర్ కథాంశం. ముంబయి నేపథ్యంలో సినిమా నడుస్తుంది. ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ కథ సాగుతుంది. హీరో, హీరోయిన్కు ఏమాత్రం సంబంధం లేని అర్జున్.. వారిని ఫాలో అవుతుంటారు. ఈ సమయంలోనే ముంబయిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలతో వీరికి గల సంబంధం ఏంటి..? అర్జున్ ఎందుకు వీరిని అనుసరిస్తున్నారు..? వంటి ఆసక్తికరమైన అంశాలతో కథనం రచించాం. ఇప్పటి వరకు చిత్రీకరణను ముంబయి, మలేషియా, చెన్నైలో జరిపాం. జూన్లో ఆడియోను విడుదల చేసి, జులైలో చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నాం. కథానాయికగా ప్రేక్షకులకు పరిచయమున్న నేను.. ఇప్పుడు దర్శకురాలిగా కూడా అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. నా ప్రయత్నానికి ప్రేక్షకులు తప్పకుండా వెన్నంటే ఉంటారన్న నమ్మకం ఉంది' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..