కిండర్గార్టెన్లో అగ్ని ప్రమాదం: 176 మంది చిన్నారులు క్షేమం
- May 07, 2018
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ పైటర్స్ అత్యంత చాకచక్యంగా అగ్ని ప్రమాదం నుంచి 176 మంది చిన్నారుల్ని రక్షించారు. అల్ వురూద్ కిండర్గార్టెన్లో అగ్ని ప్రమాదం సంభవించిందన్న సమాచారం అందుకోగానే, సివిల్ డిఫెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. దహాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 20 మంది టీచర్లు, 176 మంది విద్యార్థులు ఆ కిండర్గార్టెన్లో వున్నారని సివిల్ డిఫెన్స్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ అలి అల్ మహబూబి చెప్పారు. నీటిని అలాగే ఫోమ్ని ఉపయోగించి మంటల్ని ఆర్పివేసినట్లు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యార్థులంతా క్షేమమని అధికారికంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్









