కిండర్‌గార్టెన్‌లో అగ్ని ప్రమాదం: 176 మంది చిన్నారులు క్షేమం

- May 07, 2018 , by Maagulf
కిండర్‌గార్టెన్‌లో అగ్ని ప్రమాదం: 176 మంది చిన్నారులు క్షేమం

రస్‌ అల్‌ ఖైమా: రస్‌ అల్‌ ఖైమా సివిల్‌ డిఫెన్స్‌ పైటర్స్‌ అత్యంత చాకచక్యంగా అగ్ని ప్రమాదం నుంచి 176 మంది చిన్నారుల్ని రక్షించారు. అల్‌ వురూద్‌ కిండర్‌గార్టెన్‌లో అగ్ని ప్రమాదం సంభవించిందన్న సమాచారం అందుకోగానే, సివిల్‌ డిఫెన్స్‌ సంఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించింది. దహాన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 20 మంది టీచర్లు, 176 మంది విద్యార్థులు ఆ కిండర్‌గార్టెన్‌లో వున్నారని సివిల్‌ డిఫెన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కల్నల్‌ అలి అల్‌ మహబూబి చెప్పారు. నీటిని అలాగే ఫోమ్‌ని ఉపయోగించి మంటల్ని ఆర్పివేసినట్లు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, విద్యార్థులంతా క్షేమమని అధికారికంగా ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com