హాషిష్తో పట్టుబడ్డ వ్యక్తికి జైలు
- May 07, 2018
పాకిస్తానీ వ్యక్తి తనతోపాటు నిషేధిత హాషిష్ని తీసుకొచ్చిన నేరానికిగాను న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నిందితుడ్ని హాషిష్తో సహా పట్టుకున్నారు అధికారులు. అయితే న్యాయస్థానంలో నిందితుడు, అది తనకు తెలియకుండా జరిగిందంటూ వివరించే ప్రయత్నం చేశాడు. తన తల్లికి యూఏఈ చట్టాల గురించి తెలియదనీ, ఆ కారణంగానే ఆమె తన లగేజ్లో హాషిష్ని పెట్టిందనీ చెప్పాడు. పాకిస్తాన్లో వున్నప్పుడు తాను డ్రగ్స్ సేవించేవాడిననీ, యూఏఈలో మాత్రం తాను ఎప్పుడూ డ్రగ్స్ సేవించలేదనీ న్యాయస్థానానికి తెలిపాడు నిందితుడు. తన స్వగ్రామంలో డ్రగ్స్ సేవించడం సాధారణమేనని చెప్పిన నిందితుడు, యూఏఈలో మాత్రం ఇక్కడి చట్టాల ప్రకారం నడుచుకుంటున్నట్లు వివరించాడు. అయితే, నిందితుడి వాదనల్ని కొట్టి పారేసిన న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష ఖరారు చేసింది. జైలు శిక్ష తర్వాత నిందితుడు స్వదేశానికి డిపోర్ట్ చేయబడ్తాడు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









