మలేసియాలో పార్లమెంట్‌ ఎన్నికలు

- May 09, 2018 , by Maagulf
మలేసియాలో పార్లమెంట్‌ ఎన్నికలు

కౌలాలంపూర్‌ : అవినీతి ఆరోపణలు, కుంభకోణాల నేపథ్యంలో మలేసియా పార్లమెంట్‌ ఎన్నికల్లో పోలింగ్‌ బుధవారం ప్రారంభమైంది. ఉదయం 8గంటల నుండే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు. వారాంతంలో కాకుండా మధ్యలో ఓటింగ్‌ నిర్వహించడం వల్ల ఓటింగ్‌ శాతం తగ్గుతుందని పార్టీలు భావిస్తున్నాయి. అయితే 85శాతం వరకు పోలింగ్‌ శాతం నమోదవుతుందని ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది. ప్రధానితో సహా పలువురు ప్రముఖులు ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాని నజీబ్‌ రజార్‌ నేతృత్వంలోని పాలక సంకీర్ణం, మహితిర్‌ మహ్మద్‌ నేతృత్వంలోని ప్రతిపక్షం మధ్య ప్రధానంగా పోరు సాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com