శ్రీదేవి మృతిపై విచారణకు సుప్రీం ' నో '

- May 11, 2018 , by Maagulf
శ్రీదేవి మృతిపై విచారణకు సుప్రీం ' నో '

దివంగత నటి శ్రీదేవి మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ సునీల్ సింగ్ అనే దర్శకనిర్మాత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సీజే దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. శ్రీదేవి మరణం అనుమానాస్పదంగా ఉందని. అందువల్ల విచారణ జరిపించాలని సునీల్ సింగ్ వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడంతో ఆయన ఇదే విషయం మీద సుప్రీంకోర్టుకెక్కాడు.

గత ఫిబ్రవరి 24 న దుబాయ్ లోని ఓ లగ్జరీ హోటల్ బాత్ టబ్ లో శ్రీదేవి ' ప్రమాదవశాత్తూ మునిగి ' మరణించిన విషయం తెలిసిందే. స్పృహ కోల్పోవడంతో ఆమె తుదిశ్వాస విడిచారని అక్కడి ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంది. కాగా. శ్రీదేవి పేరిట ఆమెకు ఒమన్ లో రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఉందని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనే ఆమె మరణిస్తే ఆ సొమ్మును రిలీజ్ చేస్తారని పిటిషనర్ తరఫు లాయర్ వికాస్ సింగ్ పేర్కొన్నారు. అయితే ఇదే అంశంపై గతంలోనే దాఖలైన రెండు పిటిషన్లను తాము తోసిపుచ్చామని, ఇక జోక్యం చేసుకోలేమని కోర్టు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com