శ్రీదేవి మృతిపై విచారణకు సుప్రీం ' నో '
- May 11, 2018
దివంగత నటి శ్రీదేవి మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ సునీల్ సింగ్ అనే దర్శకనిర్మాత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సీజే దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. శ్రీదేవి మరణం అనుమానాస్పదంగా ఉందని. అందువల్ల విచారణ జరిపించాలని సునీల్ సింగ్ వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడంతో ఆయన ఇదే విషయం మీద సుప్రీంకోర్టుకెక్కాడు.
గత ఫిబ్రవరి 24 న దుబాయ్ లోని ఓ లగ్జరీ హోటల్ బాత్ టబ్ లో శ్రీదేవి ' ప్రమాదవశాత్తూ మునిగి ' మరణించిన విషయం తెలిసిందే. స్పృహ కోల్పోవడంతో ఆమె తుదిశ్వాస విడిచారని అక్కడి ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంది. కాగా. శ్రీదేవి పేరిట ఆమెకు ఒమన్ లో రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఉందని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనే ఆమె మరణిస్తే ఆ సొమ్మును రిలీజ్ చేస్తారని పిటిషనర్ తరఫు లాయర్ వికాస్ సింగ్ పేర్కొన్నారు. అయితే ఇదే అంశంపై గతంలోనే దాఖలైన రెండు పిటిషన్లను తాము తోసిపుచ్చామని, ఇక జోక్యం చేసుకోలేమని కోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







