శ్రీదేవి మృతిపై విచారణకు సుప్రీం ' నో '
- May 11, 2018
దివంగత నటి శ్రీదేవి మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ సునీల్ సింగ్ అనే దర్శకనిర్మాత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సీజే దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. శ్రీదేవి మరణం అనుమానాస్పదంగా ఉందని. అందువల్ల విచారణ జరిపించాలని సునీల్ సింగ్ వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడంతో ఆయన ఇదే విషయం మీద సుప్రీంకోర్టుకెక్కాడు.
గత ఫిబ్రవరి 24 న దుబాయ్ లోని ఓ లగ్జరీ హోటల్ బాత్ టబ్ లో శ్రీదేవి ' ప్రమాదవశాత్తూ మునిగి ' మరణించిన విషయం తెలిసిందే. స్పృహ కోల్పోవడంతో ఆమె తుదిశ్వాస విడిచారని అక్కడి ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంది. కాగా. శ్రీదేవి పేరిట ఆమెకు ఒమన్ లో రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఉందని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనే ఆమె మరణిస్తే ఆ సొమ్మును రిలీజ్ చేస్తారని పిటిషనర్ తరఫు లాయర్ వికాస్ సింగ్ పేర్కొన్నారు. అయితే ఇదే అంశంపై గతంలోనే దాఖలైన రెండు పిటిషన్లను తాము తోసిపుచ్చామని, ఇక జోక్యం చేసుకోలేమని కోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









