తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

- May 13, 2018 , by Maagulf
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

విశాఖపట్నం: ద్రోణుల ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ, కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా ఉరుములు, గాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం ఉదయం వరకు విశాఖలో 6, టెక్కలి, కళింగపట్నంలో 5, పార్వతీపురంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తా, రాయలసీమలో ఎండ తీవ్రత కొనసాగింది. పలుచోట్ల 40 డిగ్రీలు అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com