11 కార్ల దహనం: నిందితుడి అరెస్ట్
- May 13, 2018
దుబాయ్లోని ఓ షాపింగ్ మాల్ యెదుట 11 వాహనాలు ధ్వంసమయిన ఘటనలో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. ఉద్దేశ్యపూర్వకంగానే వాహనాలకు నిందితుడు నిప్పు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దుబాయ్ ఔట్లెట్ మాల్ యెదురుగా ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. నిందితుడు, స్టాఫ్ మెంబర్స్ని షాపింగ్ మాల్కి తరలించే డ్రైవర్. సహచరులతో వాగ్యుద్ధం అనంతరం నిందితుడు వాహనాన్ని తగలబెట్టాడు. ఈ క్రమంలో ఆ మంటలు మరో 10 కార్లకు వ్యాపించాయి. విచారణలో తొలుత దగ్ధమైన కారుని గుర్తించి, ఆరా తీయగా ఆ కారులో ఎలాంటి ఫ్లేమబుల్ ఐటమ్స్ లేవని నిర్ధారించి, నిందితుడ్ని అనుమానించారు. విచారణలో నిందితుడు, తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడికీ ఈ ఘటనలో స్వల్పంగా గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- US, Iraq discuss expanding economic, energy cooperation
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ







