11 కార్ల దహనం: నిందితుడి అరెస్ట్
- May 13, 2018
దుబాయ్లోని ఓ షాపింగ్ మాల్ యెదుట 11 వాహనాలు ధ్వంసమయిన ఘటనలో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. ఉద్దేశ్యపూర్వకంగానే వాహనాలకు నిందితుడు నిప్పు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దుబాయ్ ఔట్లెట్ మాల్ యెదురుగా ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. నిందితుడు, స్టాఫ్ మెంబర్స్ని షాపింగ్ మాల్కి తరలించే డ్రైవర్. సహచరులతో వాగ్యుద్ధం అనంతరం నిందితుడు వాహనాన్ని తగలబెట్టాడు. ఈ క్రమంలో ఆ మంటలు మరో 10 కార్లకు వ్యాపించాయి. విచారణలో తొలుత దగ్ధమైన కారుని గుర్తించి, ఆరా తీయగా ఆ కారులో ఎలాంటి ఫ్లేమబుల్ ఐటమ్స్ లేవని నిర్ధారించి, నిందితుడ్ని అనుమానించారు. విచారణలో నిందితుడు, తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడికీ ఈ ఘటనలో స్వల్పంగా గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







