కిడ్నాప్ కు గురైన భారతీయ ఇంజనీర్లు
- May 15, 2018
అఫ్గానిస్థాన్లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లు కిడ్నాప్ కు గురయ్యారు. వివరాల ప్రకారం... ఉత్తర బగ్లాన్ ప్రావిన్స్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ పవర్ ప్లాంట్లో ఈ ఏడుగురు భారతీయులు పనిచేస్తున్నారు. నిర్వహణలో భాగంగా పవర్ప్లాంట్కు ఇంజినీర్లు మినీ బస్సులో వెళ్తుండగా.. గుర్తుతెలియని దుండగులు తుపాకులు చూపించి అడ్డుకున్నారు. అఫ్గాన్ వాహన డ్రైవర్ భయంతో బస్సును నిలిపివేశాడు. ఏడుగురు ఇంజినీర్లతో సహా డ్రైవర్ ను కూడా కిడ్నాప్ చేశారు దుండగులు. కాబుల్లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. భారత ఇంజినీర్లను విడిపించేందుకు తగిన చర్యలు ప్రారంభించినట్లు భారత రాయబార కార్యాలయ అధికారి తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏ సంస్థ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..