హంగ్ దిశగా కర్ణాటక ఫలితాలు
- May 15, 2018
బెంగళూరు: కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా పయనిస్తున్నాయి. కన్నడ ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఇచ్చినట్లు కనిపించడం లేదు. అధికారం చేపట్టాలంటే 112 సీట్లు సాధించాల్సి ఉండగా.. అతిపెద్ద పార్టీగా అవతరించనున్న భాజపా 105 సీట్లకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో ఆ పార్టీ 58 స్థానాల్లో గెలుపొంది.. 47 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ మరో 7 సీట్ల దూరంలో నిలిచింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ 23 స్థానాల్లో గెలుపొంది 52 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. జేడీఎస్ 11 స్థానాల్లో గెలుపొంది.. 28 చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో అధికారం చేపట్టేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ కింగ్ మేకర్ నిలిచే అవకాశం కనిపిస్తోంది.
అతిపెద్ద పార్టీగా అవతరించనున్న భాజపాకు జేడీఎస్ మద్దతిస్తే యడ్యూరప్ప నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పటు కానుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారాన్ని అంత సులువుగా వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. భాజపా అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. తాము ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు జేడీఎస్తో పొత్తు పెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో జేడీఎస్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది కీలకంగా మారింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..