హంగ్ దిశగా కర్ణాటక ఫలితాలు
- May 15, 2018
బెంగళూరు: కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా పయనిస్తున్నాయి. కన్నడ ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఇచ్చినట్లు కనిపించడం లేదు. అధికారం చేపట్టాలంటే 112 సీట్లు సాధించాల్సి ఉండగా.. అతిపెద్ద పార్టీగా అవతరించనున్న భాజపా 105 సీట్లకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో ఆ పార్టీ 58 స్థానాల్లో గెలుపొంది.. 47 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ మరో 7 సీట్ల దూరంలో నిలిచింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ 23 స్థానాల్లో గెలుపొంది 52 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. జేడీఎస్ 11 స్థానాల్లో గెలుపొంది.. 28 చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో అధికారం చేపట్టేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ కింగ్ మేకర్ నిలిచే అవకాశం కనిపిస్తోంది.
అతిపెద్ద పార్టీగా అవతరించనున్న భాజపాకు జేడీఎస్ మద్దతిస్తే యడ్యూరప్ప నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పటు కానుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారాన్ని అంత సులువుగా వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. భాజపా అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. తాము ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు జేడీఎస్తో పొత్తు పెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో జేడీఎస్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది కీలకంగా మారింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







