జనసేన అధినేత పవన్కల్యాణ్ శ్రీకాకుళంలో పర్యటన
- May 20, 2018శ్రీకాకుళం:సినీ నటుడు, జనసేన అధినేత పవన్కల్యాణ్ శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కవిటి మండలం కపాసుకుద్దికి చేరుకున్న పవన్కు మత్స్యకారులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం పవన్ సముద్రతీర ప్రాంతంలో మత్స్యకారులతో కలిసి గంగామాతకు పూజలు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..మిగతా రాజకీయపార్టీలు, జనసేనకు తేడా ఉంది. నేను హామీలు ఇవ్వటానికి ఇక్కడికి రాలేదన్నారు. జనసేన మీ ముందుకు వచ్చింది. ఓట్లు అడగటానికి కాదు. ఉద్దానం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఉద్దానం సమస్యపై కదలిక మొదలైంది కానీ..అసంపూర్తిగా మిగిలిపోయింది. శ్రీకాకుళంలో వలసలు నియంత్రించే బాధ్యత తీసుకుంటాం. ప్రజల సమస్యలపై అవగాహన కోసమే జనసేన పోరాట యాత్ర. శ్రీకాకుళం దేశభక్తికి..కష్టానికి ప్రతీక. జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే..ముందు ప్రజల కష్టాలు తెలియాలి. పెద్దల ఆశీస్సులు, యువత మద్దతు, అక్కాచెల్లెళ్ల తోడుతో ప్రభుత్వ ఏర్పాటు ఖాయం. నేను ప్రకృతిని పూజించేవాడిని.
జనసేన పార్టీ మన సంస్కతిని పరిరక్షించే పార్టీ అని పవన్కల్యాణ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ