గల్ఫ్ వీసా పేరుతో ఘరానా మోసం
- May 21, 2018
హైదరాబాద్:గల్ఫ్ వీసా ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకిలో నివాసం ఉంటున్న మహ్మద్ సయీద్ ఖాలిద్కు మహ్మద్ అసిఫుద్దీన్ పరిచయమయ్యాడు. తాను హకీంపేటలో తైబా టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో సంస్థ నిర్వహిస్తున్నానని, సౌదీ అరేబియాలో ఉద్యోగం చేసేందుకు వీసాలు ఇప్పిస్తున్నానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన మహ్మద్ సయీద్ ఖాలిద్ వీసా కోసం రూ. 6లక్షలు అతనికి చెల్లించాడు. అయితే వీసా ఇప్పంచకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. డబ్బులకు గ్యారంటీగా అతని కారు ఆర్సీని ఇచ్చాడు. ఇటీవల అసిఫుద్దీన్ దుబాయికి పారిపోయారు. దీంతో బాధితుడు సయీద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









