గల్ఫ్ వీసా పేరుతో ఘరానా మోసం
- May 21, 2018
హైదరాబాద్:గల్ఫ్ వీసా ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకిలో నివాసం ఉంటున్న మహ్మద్ సయీద్ ఖాలిద్కు మహ్మద్ అసిఫుద్దీన్ పరిచయమయ్యాడు. తాను హకీంపేటలో తైబా టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో సంస్థ నిర్వహిస్తున్నానని, సౌదీ అరేబియాలో ఉద్యోగం చేసేందుకు వీసాలు ఇప్పిస్తున్నానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన మహ్మద్ సయీద్ ఖాలిద్ వీసా కోసం రూ. 6లక్షలు అతనికి చెల్లించాడు. అయితే వీసా ఇప్పంచకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. డబ్బులకు గ్యారంటీగా అతని కారు ఆర్సీని ఇచ్చాడు. ఇటీవల అసిఫుద్దీన్ దుబాయికి పారిపోయారు. దీంతో బాధితుడు సయీద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







