గల్ఫ్ వీసా పేరుతో ఘరానా మోసం

- May 21, 2018 , by Maagulf
గల్ఫ్ వీసా పేరుతో ఘరానా మోసం

హైదరాబాద్:గల్ఫ్ వీసా ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకిలో నివాసం ఉంటున్న మహ్మద్ సయీద్ ఖాలిద్‌కు మహ్మద్ అసిఫుద్దీన్ పరిచయమయ్యాడు. తాను హకీంపేటలో తైబా టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో సంస్థ నిర్వహిస్తున్నానని, సౌదీ అరేబియాలో ఉద్యోగం చేసేందుకు వీసాలు ఇప్పిస్తున్నానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన మహ్మద్ సయీద్ ఖాలిద్ వీసా కోసం రూ. 6లక్షలు అతనికి చెల్లించాడు. అయితే వీసా ఇప్పంచకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. డబ్బులకు గ్యారంటీగా అతని కారు ఆర్‌సీని ఇచ్చాడు. ఇటీవల అసిఫుద్దీన్ దుబాయికి పారిపోయారు. దీంతో బాధితుడు సయీద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com