రమదాన్: ఖతార్ పబ్లిక్ పార్క్ల సమయం పొడిగింపు
- May 21, 2018
దోహా:పబ్లిక్ పార్కులు మధ్యాహ్నం 3 గంటల నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు తెరచి వుంచుతున్నట్లు దోహా మునిసిపాలిటీ వెల్లడించింది. రమదాన్ సందర్భంగా పార్క్ల సందర్శన వేళల్ని పొడిగించినట్లు అధికారులు తెలిపారు. మునిసిపాలిటీకి చెందిన జనరల్ మానిటరింగ్ డిపార్ట్మెంట్ - టెక్నికల్ మానిటరింగ్ సెక్షన్, ఛారిటీ ఆర్గనైజేషన్స్ అలాగే హోటల్స్ మరియు ఇండివిడ్యువల్స్ రమదాన్ సందర్భంగా ఇఫ్తార్ కోసం టెంట్లను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆయా సంస్థలు, వ్యక్తులు ముందుగా అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. నిబంధనలకు అనుగుణంగా షాప్సని ఏర్పాటు చేసుకునేందుకు ఇన్స్పెక్టర్స్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షిస్తారు. రమదాన్ 14వ రోజున ఖతార్లో ఘనంగా జరిపే గరాంగావ్ ఫెస్టివల్ కోసం వినియోగింంచే ప్రోడక్ట్స్ని సైతం ఇన్స్పెక్టర్స్ తనిఖీ చేస్తారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







