29నుంచి విదేశాల్లో గోపీచంద్ మూవీ పంతం షూటింగ్..
- May 26, 2018
గోపీచంద్, మెహరీన్ నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం పంతం. దీనికి ఫర్ ఎ కాస్ అన్నది ఉపశీర్షిక. లోగడ బలుపు, పవర్, జై లవకుశ వంటి చిత్రాలకు స్క్రీన్ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ఈ మూవీ జులై 5వ తేదిన ప్రేక్షకుల ముందుకురానుంది..ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతున్నది.. ఇక మరో షెడ్యూల్ స్కాట్లాండ్, లండన్ లో జరగనుంది.. దీని కోసం ఈ నెల 29వ తేదిన చిత్ర యూనిట్ అక్కడకు బయలుదేరి వెళ్లనుంది.. అక్కడు మూడు సాంగ్స్ తో పాటు కీలక సన్నీవేశాలు చిత్రీకరించనున్నారు.. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి మూవీని విడుదలకు సిద్ధం చేస్తారు.. గోపీసుందర్ సంగీతం, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







