అలనాటి నటి గీత కపూర్ ఇకలేరు..
- May 26, 2018
అలనాటి బాలీవుడ్ నటి గీతా కపూర్(57) వృద్ధాశ్రమంలో శనివారం కన్నుమూశారు. అయిన వాళ్ళ ఆదరణకు నోచుకోని గీత కపూర్ ఏళ్ల తరబడి వృద్ధాశ్రమంలో గడిపారు.దాదాపు 50 చిత్రాల్లో నటించిన ఆమె చివరివరకు కొడుకు కూతురి జాడకోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ మధ్యలోనే వారిని చూడకుండా మరణించిందని ఆమె అభిమాని అశోక్ పండిట్ వెల్లడించాడు. గీతా కపూర్ కు కొడుకు, కూతురు ఉన్నారని వారు ఆమెను ఆదరించలేదని కొడుకు గీతా కపూర్ ను చిత్రహింసలకు గురిచేసి నాలుగురోజులకు ఒకసారి అన్నం పెట్టేవాడని దాంతో ఆమె అనారోగ్యం పాలైంది.ఆ సమయంలో ఆమెను ఆసుపత్రిలోనే వదిలేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆమె పరిస్థితి తెలుసుకున్న తాను ఆసుపత్రి బిల్లులు కట్టి గీతా కపూర్ ను వృద్ధాశ్రమంలో చేర్పించానని అశోక్ పండిట్ అన్నారు.కానీ వృద్ధాశ్రమంలో ఉన్నంతకాలం కొడుకు కూతురుకోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిందని కానీ వారు రాలేదని తీవ్రంగా దుఃక్కించేదని... ఈ క్రమంలో ఆరోగ్యాన్ని పాడుచేసుకుని కన్నుమూశారని అన్నారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆస్పత్రిలో ఉంచాం. ఆమె తరుపువారు ఎవరైనా వస్తారేమో రెండు రోజులపాటు ఎదురుచూస్తాం. రానిపక్షంలో మేమే అంత్యక్రియలు జరిపిస్తాం’ అని అశోక్ పండిట్ తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







