అలనాటి నటి గీత కపూర్ ఇకలేరు..
- May 26, 2018అలనాటి బాలీవుడ్ నటి గీతా కపూర్(57) వృద్ధాశ్రమంలో శనివారం కన్నుమూశారు. అయిన వాళ్ళ ఆదరణకు నోచుకోని గీత కపూర్ ఏళ్ల తరబడి వృద్ధాశ్రమంలో గడిపారు.దాదాపు 50 చిత్రాల్లో నటించిన ఆమె చివరివరకు కొడుకు కూతురి జాడకోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ మధ్యలోనే వారిని చూడకుండా మరణించిందని ఆమె అభిమాని అశోక్ పండిట్ వెల్లడించాడు. గీతా కపూర్ కు కొడుకు, కూతురు ఉన్నారని వారు ఆమెను ఆదరించలేదని కొడుకు గీతా కపూర్ ను చిత్రహింసలకు గురిచేసి నాలుగురోజులకు ఒకసారి అన్నం పెట్టేవాడని దాంతో ఆమె అనారోగ్యం పాలైంది.ఆ సమయంలో ఆమెను ఆసుపత్రిలోనే వదిలేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆమె పరిస్థితి తెలుసుకున్న తాను ఆసుపత్రి బిల్లులు కట్టి గీతా కపూర్ ను వృద్ధాశ్రమంలో చేర్పించానని అశోక్ పండిట్ అన్నారు.కానీ వృద్ధాశ్రమంలో ఉన్నంతకాలం కొడుకు కూతురుకోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిందని కానీ వారు రాలేదని తీవ్రంగా దుఃక్కించేదని... ఈ క్రమంలో ఆరోగ్యాన్ని పాడుచేసుకుని కన్నుమూశారని అన్నారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆస్పత్రిలో ఉంచాం. ఆమె తరుపువారు ఎవరైనా వస్తారేమో రెండు రోజులపాటు ఎదురుచూస్తాం. రానిపక్షంలో మేమే అంత్యక్రియలు జరిపిస్తాం’ అని అశోక్ పండిట్ తెలిపారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..