మనామాలో అడ్వాన్స్డ్ మెట్రో నెట్వర్క్
- May 28, 2018
బహ్రెయిన్:బహ్రెయిన్ త్వరలో అడ్వాన్స్ మెట్రో నెట్వర్క్ని సొంతం చేసుకోబోతోంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ టెలిమ్యూనికేషన్ అప్పుడే చర్యలు ప్రారంభించింది. ప్రధమిక దశలో మెట్రో నెట్వర్క్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్నీ, మరికొన్ని ముఖ్యమైన ప్రాంతాల్ని కలిపేలా తీర్చిదిద్దబడుతుందని తెలుస్తోంది. వీటిల్లో బహ్రెయిన్ బే, బాబ్ అల్ బహ్రెయిన్, ఫైనాన్షియల్ హార్బర్, సీఫ్ తదితర ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ తొలి దశలో రాబోతోంది. జులై నాటికి ఫైనల్ ప్లాన్స్ ఖరారవుతాయని చెప్పారు ట్రాన్స్పోర్టేషన్ అండ్ టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్ కమాల్ అహ్మద్. అడ్వాన్స్ మెట్రో రాకతో బహ్రెయిన్ అభివృద్ధిలో మరో మైలు రాయిలా బావించాల్సి వుంటుందని ఆయన వివరించారు. మరోపక్క జిసిసి రైల్ ప్రాజెక్ట్ చాలా వేగంగా పూర్తవుతోంది. యూఏఈ, సౌదీ అరేబియా 2021 నాటికి ఒమన్తో లింక్ పూర్తి చేస్తాయి. కువైట్, బహ్రెయిన్ 2023 నాటికి జాయిన్ అవుతాయి. 15.4 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







