గీతా ఆర్ట్స్ బేనర్లో సాయి ధరమ్ తేజ్!
- May 29, 2018
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 2014లో 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమా ద్వారా తెరంగ్రటం చేశాడు. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ సుప్రీం స్టార్ గీతా ఆర్ట్స్ బేనర్లో సినిమా చేయలేదు.
ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత గీతా ఆర్ట్స్ బేనర్లో తేజ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల 'ఛలో' సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.
తమ ఫ్యామిలీకి చెందిన హీరోలను నిలబెట్టడంలో మెగా కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది. మంచి కథ దొరకడం, అది సాయి ధరమ్ తేజ్ ఎనర్జీ లెవల్స్కు సూటయ్యే విధంగా ఉండటంతో నిర్మాత అల్లు అరవింద్ వెంటనే ఈ కాంబినేషన్ సెట్ చేశాడట.
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే గీతా ఆర్ట్స్ ప్రాజెక్ట్ మొదలవుతుందని టాక్.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







