నిపా ఎఫెక్ట్: కేరళ నుంచి పండ్లు, కూరగాయలపై యూఏఈ నిషేధం
- May 29, 2018
యు.ఏ.ఈ:నిపా వైరస్ భయాందోళనల కారణంగా యూఏఈ, కేరళ నుంచి వచ్చే తాజా పండ్లు, కూరగాయలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్, స్థానిక ఫుడ్ అథారిటీస్కి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ని ఎమిరేట్స్, కేరళ నుంచి వచ్చే తాజా కూరగాయలు, పండ్లపై నిషేధం వున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. కేరళలో నిపా వైరస్ కారణంగా ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. నిపా వైరస్కి ప్రధాన కారణంగా పండ్లను తినే రకం గబ్బిలాలని గుర్తించారు. మామిడి పండ్లు, డేట్స్, అరటిపండ్లు ఈ రకం గబ్బిలాలకు ఇష్టమైన ఆహారం.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







