రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం
- May 29, 2018
హైదరాబాద్ : రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన కేసులో మరో నిందితుడు వాకటి చంద్రశేఖర్ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ అవినాష్ మహం తి కథనం ప్రకారం.. ఈస్ట్రన్ రైల్వేస్, కోల్కత్తలో మినిస్టర్ కోటా కింద టిక్కెట్ కలెక్టర్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గ్యాంగ్మెన్ వంటి ఉద్యోగాలిప్పిస్తామని భాగవతుల లలితమ్మ, దుప్పట్ల శశిభూషణ్రావు, భగవతుల శ్రీనాథ్, వాకటి చంద్రశేఖర్ ముఠా మోసం చేసింది.
20 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ. 8 నుంచి రూ. 10 లక్షల వరకు సుమారు కోటి రూపాయలకుపైగా వసూలు చేసి, వారికి నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. దీనిపై బాధితుడైన పత్రుని రఘు, తదితరులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2015లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే లలితమ్మ, శశిభూషణ్రావు, శ్రీనాథ్లను అరెస్ట్ చేయగా చంద్రశేఖర్ బెంగళూర్కు పరారయి అజాతంలోకి వెళ్లిపోయాడు. కేఎన్ విజయ్కుమార్ బృందం ఎట్టకేలకు నిందితుడు చంద్రశేఖర్ను అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







