ఫుల్ జోష్లో ధోనీ సేన
- May 29, 2018



చెన్నై సూపర్ కింగ్స్ విజయానందాన్ని ఎంజాయ్ చేస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో హైదరాబాద్ ను 8వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్ - 2018 కప్ను కైవసం చేసుకుంది ధోనీ సేన. ఈ సందర్భంలో గ్రౌండ్ లోకి పరుగెత్తుకొచ్చింది ఓ చిన్నారి. ఆ చిన్నారి మరెవరోకాదు, ధోనీ కూతురు జివా. అంతలోనే భార్య సాక్షి కూడా స్టేడియంలోకి వచ్చి చిన్నారిని భుజాన వేసుకుని తన భర్తను దగ్గరకు తీసుకుని శుభాకాంక్షలు చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ టీం ముంబై నుంచి తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ జర్నీలో మరిన్ని మజిలీలు ఆస్వాదించింది..
ఇదిలాఉంటే, ఐపీఎల్ 2018 విజేత ఎవరు కాబోతున్నారో వారం ముందే చెప్పిన ఏబీ డివిలియర్స్ మాటలు ఇప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఐపీఎల్ 11వ సీజన్ ట్రోఫీ చెన్నై సూపర్ కింగ్స్దే అని ముందే తేల్చిచెప్పేశాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్. ఓ నేషనల్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో డివిలియర్స్ వారం కిందటే విన్నర్ ఎవరనేది చెప్పాడు. 'ఐపీఎల్ ఫైనల్స్ ఏయే జట్ల మధ్య జరుగుతుందో చెప్పడం కష్టమని అయితే,ః మీరు ఏ జట్టు గెలుస్తుందో ఊహించమంటున్నారు కాబట్టి ఫైనల్స్లో చెన్నై-హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్లో ధోని తన మ్యాజిక్తో చెన్నై జట్టుని గెలిపిస్తాడు' అని అన్నాడు డెవిలియర్స్. అతని మాటలు నూటికి నూరు శాతం నిజం కావడం విశేషం.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







