రెండ్రోజులు బ్యాంకులకు సెలవు.. మరి ఏటీఎంల పరిస్థితి.. ఆందోళనలో జనం
- May 30, 2018
గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి ఇప్పుడు జనం జేబుల్లో డబ్బులు ఉండడం లేదు. అన్ని కొనుగోలు వ్యవహారాలను కార్డుల ద్వారానే చక్కబెడుతున్నారు. మరి బ్యాంకు ఉద్యోగులు రెండు రోజులు బంద్ పాటిస్తే.. డబ్బులు అర్జంటుగా అవసరమైతే.. ఏటీఎంలో డబ్బులు లేక పోతే పరిస్థితి ఏంటని జనం ఆందోళన చెందుతున్నారు. తమకు జీతాలు పెంచాలంటూ బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగక తప్పలేదని, ఈ సమ్మెలో మొత్తం 9 బ్యాంక్ ఎంప్లాయి అసోసియేషన్లు సమ్మెలో పాల్గొంటున్నాయని బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) తెలియజేసింది. ఈ రెండు రోజులు ఏటీఎంలు కూడా పనిచేయవని, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని యూనియన్ కోరింది. ప్రజలు సాధ్యమైనంతవరకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకులు మాములుగానే పనిచేస్తాయని తెలిపింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







