ఉత్సాహంగా సాగుతున్న మోడీ ఇండోనేషియా పర్యటన
- May 30, 2018
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండోనేషియా పర్యటన ఉత్సాహంగా సాగుతోంది. మూడు దేశాల టూర్ లో భాగంగా నిన్న రాత్రి ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకున్న మోడీ.. ఇవాళ ఉదయం... అధ్యక్షుడు జోకో విడోడోతో భేటీ అయ్యారు. మెర్దేకా ప్యాలెస్ చేరుకున్న మోడీకి.. అధ్యక్షుడు విడోడో స్వయంగా ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం కాలిబటలో అమరవీరులకు నివాళులు అర్పించారు
అనంతరం రెండు దేశాల స్నేహ బంధానికి గుర్తుగా ఓ శిలాఫలకాన్ని ప్రధాని మోడీ, ఇండోనేషియా అధ్యక్షుడు విడోడో ఆవిష్కరించారు. అక్కడే ఏర్పాటు చేసిన మ్యూజియం సందర్శించారు. ఈ సందర్భంగా మోడీ ఆ దేశ సంప్రదాయ డ్రమ్స్ వాయించి అందరినీ అలరించారు..
ఆ తర్వాత రెండు దేశాల అధినేతలు... వ్యూహాత్మక చర్చలు జరిపారు. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్... సాగర్ అన్నది తన పర్యటన థీమ్ అని మోడీ వెల్లడించారు.
ఇప్పటికే వ్యాపార, వాణిజ్య రంగాల్లో బలమైన బంధాలున్న ఈ రెండు దేశాలు.. భవిష్యత్తులో మరింత స్నేహభావంతో మెలగాలని నిర్ణయించారు. అలాగే ఉగ్రవాదంపై ఇండోనేషియా జరుపుతున్న పోరాటానికి భారత్ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని మోడీ భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







