ఖతర్ ను హెచ్చరించిన సౌదీ
- June 02, 2018
సౌదీ అరేబియా, ఖతర్ల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త మిత్రుడు రష్యాతో మైత్రిని మరింత పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా ఆ దేశం నుంచి ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సయిల్ సిస్టమ్ కొనుగోలు చేయాలని ఖతర్ భావిస్తోంది. ఈ ప్రయత్నాలు తెలుసుకున్న వెంటనే సౌదీ అరేబియా తీవ్రంగా స్పందించింది. ఖతర్ గనుక ఆ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసే పక్షంలో ఆ దేశంపై దాడికి దిగుతామని హెచ్చరించింది. అత్యాధునిక క్షిపణి వ్యవస్థ ఖతర్ చేతిలో పడకుండా చూడాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మార్కాన్కు సౌదీ రాజు లేఖ రాసినట్లు ఫ్రాన్స్ పత్రిక లె మోండే రాసింది. సౌదీతో పాటు యూఏఈ, బెహ్రయిన్ దేశాలు ఖతర్తో సంబంధాలు తెంచుకున్న విషయం తెలిసిందే. తీవ్రవాదులకు అండగా నిలిచారన్న ఆరోపణలతో వీరు గత జూన్లో ఖతర్పై ఆర్థిక ఆంక్షులు కూడా విధించాయి.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







