ఖతర్ ను హెచ్చరించిన సౌదీ
- June 02, 2018
సౌదీ అరేబియా, ఖతర్ల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త మిత్రుడు రష్యాతో మైత్రిని మరింత పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా ఆ దేశం నుంచి ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సయిల్ సిస్టమ్ కొనుగోలు చేయాలని ఖతర్ భావిస్తోంది. ఈ ప్రయత్నాలు తెలుసుకున్న వెంటనే సౌదీ అరేబియా తీవ్రంగా స్పందించింది. ఖతర్ గనుక ఆ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసే పక్షంలో ఆ దేశంపై దాడికి దిగుతామని హెచ్చరించింది. అత్యాధునిక క్షిపణి వ్యవస్థ ఖతర్ చేతిలో పడకుండా చూడాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మార్కాన్కు సౌదీ రాజు లేఖ రాసినట్లు ఫ్రాన్స్ పత్రిక లె మోండే రాసింది. సౌదీతో పాటు యూఏఈ, బెహ్రయిన్ దేశాలు ఖతర్తో సంబంధాలు తెంచుకున్న విషయం తెలిసిందే. తీవ్రవాదులకు అండగా నిలిచారన్న ఆరోపణలతో వీరు గత జూన్లో ఖతర్పై ఆర్థిక ఆంక్షులు కూడా విధించాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







