ఖతర్‌ ను హెచ్చరించిన సౌదీ

- June 02, 2018 , by Maagulf
ఖతర్‌ ను హెచ్చరించిన సౌదీ

సౌదీ అరేబియా, ఖతర్‌ల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త మిత్రుడు రష్యాతో మైత్రిని మరింత పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా ఆ దేశం నుంచి ఎస్‌ 400 ఎయిర్‌ డిఫెన్స్‌ మిస్సయిల్‌ సిస్టమ్‌ కొనుగోలు చేయాలని ఖతర్‌ భావిస్తోంది. ఈ ప్రయత్నాలు తెలుసుకున్న వెంటనే సౌదీ అరేబియా తీవ్రంగా స్పందించింది. ఖతర్‌ గనుక ఆ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసే పక్షంలో ఆ దేశంపై దాడికి దిగుతామని హెచ్చరించింది. అత్యాధునిక క్షిపణి వ్యవస్థ ఖతర్‌ చేతిలో పడకుండా చూడాల్సిందిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మార్కాన్‌కు సౌదీ రాజు లేఖ రాసినట్లు ఫ్రాన్స్‌ పత్రిక లె మోండే రాసింది. సౌదీతో పాటు యూఏఈ, బెహ్రయిన్‌ దేశాలు ఖతర్‌తో సంబంధాలు తెంచుకున్న విషయం తెలిసిందే. తీవ్రవాదులకు అండగా నిలిచారన్న ఆరోపణలతో వీరు గత జూన్‌లో ఖతర్‌పై ఆర్థిక ఆంక్షులు కూడా విధించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com