ఇరాక్:13 మంది తెలంగాణవాసులు బంధీలుగా నరకయాతన
- June 03, 2018నిజామాబాద్:ఇరాక్లో 13 మంది తెలంగాణవాసులు బంధీలుగా నరకయాతన అనుభవిస్తున్నారు. భారీగా వేతనాలు అంటూ తమను బశ్రా ప్రాంతానికి ఏజెంట్లు అక్రమంగా తరలించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు బాధితులు షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుల్లో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వాసులు ఉన్నట్లు సమాచారం. తమకు కనీసం మంచినీరు కూడా దొరకడం లేదని, ఏజెంట్లు తమను మోసం చేశారంటూ వాట్సాప్ ద్వారా బాధితులందరూ కలిసి ఓ వీడియో పంపారు.
తెలంగాణ ప్రభుత్వం తమ వాళ్లను ఆదుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు కోరుతున్నారు. గల్ఫ్ బాధితుల సంఘం ప్రతినిధి బసంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ దృష్టికి ఇరాక్లో తెలంగాణ వాసుల బంధీ సమస్యను తీసుకెళ్లారు. ప్రస్తుతం బాగ్దాద్ లోని బశ్రాలో ఓ ప్రైవేట్ కంపెనీలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్