అమెరికాలో తెలుగు యువకుడు మృతి
- June 03, 2018న్యూయార్క్: స్నేహితులతో కలిసి సరదాగా బోటింగ్కు వెళ్లిన అనూప్ తోట(26) అనే తెలుగు యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఇండియానాలోని బ్లూమింగ్టౌన్ సమీపంలో ఉన్న మాన్రో సరస్సులో అతను గల్లంతయ్యాడు.
బోటింగ్ అనంతరం అనూప్ సరదాగా ఈతకొట్టాడని ఈ క్రమంలోనే సరస్సులో గల్లంతయ్యాడని స్నేహితులు వెల్లడించారు. అనూప్ గల్లంతవడంతో 911 నంబరుకి ఫోన్ చేసి రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రెస్క్యూ సిబ్బంది సరస్సులో గాలించగా 2రోజుల తర్వాత అనూప్ మృతదేహం లభ్యమైంది. అనూప్ మృతి వార్త తెలిసిన తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అనూప్ స్నేహితులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. ఈత కొడుతున్న సమయంలో పెద్ద అల అతన్ని బలంగా ఢీకొట్టడంతోనే అతను మునిగిపోయాడని, ఆ తర్వాత అతను కనిపించలేదని వారు వాపోయారు. అనూప్ కుటుంబాన్ని ఆదుకోవడానికి గో ఫండ్ ద్వారా నిధులు సేకరించే ప్రయత్నం కూడా మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..