ఉమ్రా కోసం ఖతారీ పౌరులు, రెసిడెంట్స్‌కి సౌదీ వెల్‌కమ్‌

- June 06, 2018 , by Maagulf
ఉమ్రా కోసం ఖతారీ పౌరులు, రెసిడెంట్స్‌కి సౌదీ వెల్‌కమ్‌

జెడ్డా: ఖతారీ పౌరులను, రెసిడెంట్స్‌ను ఉమ్రా కోసం వెల్‌కమ్‌ చేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ హజ్‌ అండ్‌ ఉమ్రా వెల్లడించింది. తమ ఇన్ఫర్మేషన్‌ని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ స్వాగతం పలుకుతుందని మినిస్ట్రీ పేర్కొంది. ఖతార్‌లో నివసిస్తున్న వలసదారులు తమ డేటాను మినిస్ట్రీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి వుంటుంది. సౌదీ అరేబియా ప్రభుత్వం ఆథరైజ్‌ చేసిన ఉఉమ్రా కంపెనీల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి వుంటుంది. రమదాన్‌ సందర్భంగా ఉమ్రా ప్రార్థనల కోసం వచ్చే ఖతారీ పౌరులు, వలసదారులు జెడ్డాలోని కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా సౌదీలోకి రావొచ్చు. వివిధ దేశాల నుంచి సుమారు 7 మిలియన్ల మంది ముస్లింలు ఉమ్రా కోసం వస్తారని మినిస్ట్రీ ఆఫ్‌ హజ్‌ అండ్‌ ఉమ్రా అంచనా వేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com