ప్లాస్టిక్ బ్యాగ్ బ్యాన్పై అప్డేట్ విడుదల చేసిన మినిస్ట్రీ
- June 07, 2018
మస్కట్: ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి, తద్వారా మానవాళికీ వాటిల్లుతున్న ముప్పు నేపథ్యంలో ప్లాస్టిక్ బ్యాగ్స్పై బ్యాన్కి సంబంధించి తాజా రెగ్యులేషన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్ వెల్లడించింది. ఆన్ లైన్ ద్వారా వెల్లడించిన ఈ ప్రకటనలో, ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో బయోడిగ్రేడబుల్ బ్యాగుల్ని వినియోగించే దిశగా రిజల్యూషన్ వుంటుందని పేర్కొంది. మార్కెట్ని, అలాగే పలు రకాలైన బ్యాగ్స్కి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత, రిజల్యూషన్కి రూపకల్పన చేయబోతున్నామనీ, త్వరలోనే నిర్ణయం వెలుగు చూస్తుందని, దీనికి స్పెసిఫికేషన్స్ అండ్ స్టాండర్డ్స్ కమిటీ - మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అప్రూవల్ లభించాల్సి వుందని మినిస్ట్రీకి చెందిన అధికారి ఒకరు గతంలో చెప్పారు. ఒమన్లో ఓ సూపర్ మార్కెట్ ఛైన్కి చెందిన మేనేజర్ మాట్లాడుతూ, రోజూ 75,000 నుంచి 80,000 వరకు ప్లాస్టిక్ బ్యాగ్స్ని తమ బ్రాంచ్ నుంచి వినియోగిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజూ దాదాపు 15 వేల మంది విజిటర్స్, ఒక్కొక్కరు ఐదేసి చొప్పున బ్యాగ్స్ని రోజూ తీసుకెళుతుంటారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







