తలైవా అభిమానులకు శుభవార్త...!

- June 08, 2018 , by Maagulf
తలైవా అభిమానులకు శుభవార్త...!

చెన్నై: ప్రపంచవ్యాప్తంగా గురువారం 'కాలా' విడుదల కాగా, రజనీ మాత్రం ఎప్పటిలాగే అభిమానులకు దూరంగా ఉన్నారు. అయితే ఈసారి అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చే పని కోసమే ఆయన దూరమయ్యారు. రజనీ హీరోగా కార్తిక్‌ సుబ్బురాజ్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్‌ గురువారం డార్జిలింగ్‌లో ప్రారంభమైంది. నిరాడంబరంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనిట్‌ సభ్యుల సమక్షంలో తొలి షాట్‌కు క్లాప్‌ కొట్టారు. ఇందులో రజనీతోపాటు విజయ్‌ సేతుపతి, బాబీసింహా, సిమ్రాన్‌, మేఘ ఆకాష్‌ తదితరులు నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com