రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు
- June 09, 2018
ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు పడింది. నారాయణగూడలో డయాగ్నోస్టిక్ సెంట్రల్ హబ్ ప్రారంభమైంది. 53 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకువచ్చింది వైద్యశాఖ. డయాగ్నోస్టిక్ సెంట్రల్ హబ్ పేద ప్రజలకు వరమన్నారు మంత్రి కేటీఆర్. పైసా ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్ ప్రారంభమైంది. నారాయణగూడ ఐపీఎం క్యాంపస్లో హబ్ను మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్ ప్రారంభించారు. ఇందులో ఉచితంగా 53 రకాల వైద్య పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. 106 కేంద్రాల నుంచి సెంట్రల్ హబ్కు నమూనాలు రానున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను మంత్రులు తిలకించారు. వైద్య పరికరాల గురించి డాక్టర్లు వివరించారు. మంత్రి కేటీఆర్కు వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించారు.
తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంట్రల్ హబ్ పేద ప్రజలకు వరమన్నారు కేటీఆర్. పైసా ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సర్కారు వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. కేసీఆర్ కిట్లు వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో 40 నుంచి 50 శాతం ప్రసవాలు పెరిగాయన్నారు కేటీఆర్.
డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు తెలంగాణ వైద్య చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉచిత డయాగ్నోస్టిక్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా అన్ని రకాల పరీక్షల రిపోర్టులు 24 గంటల్లో ఇచ్చేలా ఏర్పాటు చేశారు. 3 షిఫ్ట్ల్లో సిబ్బంది సేవలు అందించనున్నారు.
తాజా వార్తలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు









