పెరిగిన బంగారం ధర

- June 09, 2018 , by Maagulf
పెరిగిన బంగారం ధర

అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ బంగారం ధర పెరిగింది. దీంతో మళ్లీ రూ.32వేల మార్క్‌ను తాకింది. శనివారం నాటి ట్రేడింగ్‌లో రూ. 100 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 32,050కు చేరింది. దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తుతుండటంతో ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తూ రూ.41 వేల మార్క్‌ను దాటింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో నేటి బులియన్‌ మార్కెట్లో వెండి ధర రూ.100 పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com