జూలై 17 నుంచి నిలిచిపోనున్న యాహు మెసెంజర్ యాప్ సేవలు
- June 09, 2018
ఇక యాహూ మెసెంజర్ సేవలు నిలిచిపోనున్నాయి. జూలై 17వ తేదీ నుంచి యాహూ మెసెంజర్ సేవలను నిలిపివేస్తున్నట్లు దాని నిర్వహణ సంస్థ ఓత్ ఐఎన్సీ వెల్లడించింది. యాహూ మెసెంజర్ యూజర్ల ఐడీలు మాత్రం అలాగే ఉంటాయని వాటిని మెయిల్, ఇతర సేవలను వాడుకునేందుకు ఆ ఐడీ పనికొస్తుందని తెలిపింది. వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ వంటి మెసేజింగ్ యాప్స్కు..యాహూ మెసెంజర్ పోటీ ఇవ్వడంలో విఫలమైంది.దీంతో క్రమంగా యూజర్లు తగ్గుతూ వచ్చారు. ఇక ఆ మెసెంజర్ సేవలకు ముగింపు పలకక తప్పలేదు. కానీ ఒకప్పుడు నెటిజన్లకు యాహూ మెసెంజర్ ఒక్కటే చాటింగ్ మెసెంజర్గా ఉండేది . యూజర్ల అభిరుచికి తగినట్లుగా డిస్కస్ రూమ్స్ కూడా ఉండేవి. వాయిస్ చాట్, వీడియో చాట్ కూడా అందుబాటులో ఉండేది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







