రైతుబంధు'బ్రాండ్ అంబాసిడర్'విశాల్ !
- June 09, 2018
అటు సినిమాలు.. ఇటు సామాజిక-రాజకీయ కార్యకలాపాలు.. రెండువైపులా చురుగ్గా కదులుతూ వెర్సటైల్ హీరోయిజాన్ని చాటుకుంటున్న కోలీవుడ్ హీరో విశాల్. 'పందెం కోడి' ఫేమ్ గా యితడు తెలుగు ప్రేక్షకుడికి సైతం బాగా పరిచయం. తాజాగా.. సొంత బేనర్పై విశాల్ హీరోగా చేసిన 'ఇరుంబుతిరై' మూవీ 'అభిమన్యుడు' పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. పాజిటివ్ టాక్తో నడుస్తూ.. తెలుగు మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు దీటుగా వసూళ్లు దండుకుంటున్నాడు 'అభిమన్యుడు'. ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల రైతుల పట్ల ఔదార్యం చూపుతూ.. విశాల్ ఓ కీలక ప్రకటన చేశాడు. తెలుగు ప్రేక్షకుడు ఆదరిస్తున్న తీరు తనను ముగ్ధుడ్ని చేసిందని చెబుతూ.. 'అభిమన్యుడు' మూవీ సాధించిన వసూళ్లలో లాభాలను రైతులకు పంచాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే.. రైతుబంధు పేరుతో అన్నదాతల కోసం సరికొత్త పథకం పుట్టుకొచ్చి హల్చల్ చేస్తోంది. దీనిగురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కథలుకథలుగా చెప్పుకుంటున్న తరుణంలో.. తాజాగా విశాల్ దృక్పథం కూడా చర్చనీయాంశమైంది.
ఒక్కో టికెట్పై ఒక్కో రూపాయి చొప్పున రైతులకు అందివ్వనున్నట్లు చెప్పాడు హీరో విశాల్. తొలి వారంలో అభిమన్యుడు రూ. 12 కోట్ల మేర రాబట్టాడు. ఈ మొత్తంలో ఎంత వాటా రైతులకిస్తాడన్న లెక్క స్పష్టంగా తేలలేదు. డైరెక్ట్గా రైతులకు చేరేలా ఎలా అందిస్తాడన్న క్లారిటీ కూడా లేదు. ఏదేమైనా.. విశాల్ తన నిర్ణయంతో సినిమా సెలబ్రిటీల్లో కొత్త ఒరవడికి చోటిచ్చినట్లయింది. మరి 'అభిమన్యుడ్ని' ఎంతమంది మిగతా హీరోలు ఫాలో అవుతారో చూడాలి..!
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







