రైతుబంధు'బ్రాండ్ అంబాసిడర్'విశాల్ !
- June 09, 2018
అటు సినిమాలు.. ఇటు సామాజిక-రాజకీయ కార్యకలాపాలు.. రెండువైపులా చురుగ్గా కదులుతూ వెర్సటైల్ హీరోయిజాన్ని చాటుకుంటున్న కోలీవుడ్ హీరో విశాల్. 'పందెం కోడి' ఫేమ్ గా యితడు తెలుగు ప్రేక్షకుడికి సైతం బాగా పరిచయం. తాజాగా.. సొంత బేనర్పై విశాల్ హీరోగా చేసిన 'ఇరుంబుతిరై' మూవీ 'అభిమన్యుడు' పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. పాజిటివ్ టాక్తో నడుస్తూ.. తెలుగు మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు దీటుగా వసూళ్లు దండుకుంటున్నాడు 'అభిమన్యుడు'. ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల రైతుల పట్ల ఔదార్యం చూపుతూ.. విశాల్ ఓ కీలక ప్రకటన చేశాడు. తెలుగు ప్రేక్షకుడు ఆదరిస్తున్న తీరు తనను ముగ్ధుడ్ని చేసిందని చెబుతూ.. 'అభిమన్యుడు' మూవీ సాధించిన వసూళ్లలో లాభాలను రైతులకు పంచాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే.. రైతుబంధు పేరుతో అన్నదాతల కోసం సరికొత్త పథకం పుట్టుకొచ్చి హల్చల్ చేస్తోంది. దీనిగురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కథలుకథలుగా చెప్పుకుంటున్న తరుణంలో.. తాజాగా విశాల్ దృక్పథం కూడా చర్చనీయాంశమైంది.
ఒక్కో టికెట్పై ఒక్కో రూపాయి చొప్పున రైతులకు అందివ్వనున్నట్లు చెప్పాడు హీరో విశాల్. తొలి వారంలో అభిమన్యుడు రూ. 12 కోట్ల మేర రాబట్టాడు. ఈ మొత్తంలో ఎంత వాటా రైతులకిస్తాడన్న లెక్క స్పష్టంగా తేలలేదు. డైరెక్ట్గా రైతులకు చేరేలా ఎలా అందిస్తాడన్న క్లారిటీ కూడా లేదు. ఏదేమైనా.. విశాల్ తన నిర్ణయంతో సినిమా సెలబ్రిటీల్లో కొత్త ఒరవడికి చోటిచ్చినట్లయింది. మరి 'అభిమన్యుడ్ని' ఎంతమంది మిగతా హీరోలు ఫాలో అవుతారో చూడాలి..!
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







