దుబాయ్ లో మృతిచెందిన జగిత్యాల వాసి
- June 10, 2018
దుబాయ్:జగిత్యాల పట్టణం కృష్ణానగర్ వార్డ్ నెం.17 కు చెందిన డొల్లాని గణేష్ (60) ఈనెల 5న దుబాయ్ లో గుండెపోటుతో చనిపోయారు. మృతుని శవపేటిక సోమవారం ఉదయం ఏర్ ఇండియా విమానంలో దుబాయి నుండి హైదరాబాద్ కు చేరుకోనుంది. శవపేటికతోపాటు దుబాయ్ నుండి మృతుని చిన్న కుమారుడు కరుణాకర్ వస్తున్నారు. మృతుడు గణేష్ స్వగ్రామం మేడిపల్లి మండలం వల్లంపల్లి, కాగా జగిత్యాల పట్టణంలో స్థిరపడ్డారు. మృతునికి భార్య అరుణ, కుమారులు సంతోష్, కరుణాకర్ ఉన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి, ప్రవాసి మిత్ర అధ్యక్షులు మంద భీంరెడ్డిల విజ్ఞప్తిమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై విభాగం వారు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి జగిత్యాల పట్టణం వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గత 25 ఏళ్లుగా గల్ఫ్ లో ఉద్యోగం చేస్తున్నగణేష్ అకస్మాత్తుగా చనిపోవడంపట్ల వల్లంపల్లి మాజీ సర్పంచ్ సంపత్ రావు, జగిత్యాల 17వ వార్డు కౌన్సిలర్ వీరబత్తిని పద్మజ శ్రీనివాస్ లు సంతాపం ప్రకటించారు.

తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







