దుబాయ్ లో మృతిచెందిన జగిత్యాల వాసి
- June 10, 2018
దుబాయ్:జగిత్యాల పట్టణం కృష్ణానగర్ వార్డ్ నెం.17 కు చెందిన డొల్లాని గణేష్ (60) ఈనెల 5న దుబాయ్ లో గుండెపోటుతో చనిపోయారు. మృతుని శవపేటిక సోమవారం ఉదయం ఏర్ ఇండియా విమానంలో దుబాయి నుండి హైదరాబాద్ కు చేరుకోనుంది. శవపేటికతోపాటు దుబాయ్ నుండి మృతుని చిన్న కుమారుడు కరుణాకర్ వస్తున్నారు. మృతుడు గణేష్ స్వగ్రామం మేడిపల్లి మండలం వల్లంపల్లి, కాగా జగిత్యాల పట్టణంలో స్థిరపడ్డారు. మృతునికి భార్య అరుణ, కుమారులు సంతోష్, కరుణాకర్ ఉన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి, ప్రవాసి మిత్ర అధ్యక్షులు మంద భీంరెడ్డిల విజ్ఞప్తిమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై విభాగం వారు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి జగిత్యాల పట్టణం వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గత 25 ఏళ్లుగా గల్ఫ్ లో ఉద్యోగం చేస్తున్నగణేష్ అకస్మాత్తుగా చనిపోవడంపట్ల వల్లంపల్లి మాజీ సర్పంచ్ సంపత్ రావు, జగిత్యాల 17వ వార్డు కౌన్సిలర్ వీరబత్తిని పద్మజ శ్రీనివాస్ లు సంతాపం ప్రకటించారు.

తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







