భారతీయులకు క్షమాపణ చెప్పిన ప్రియాంక చోప్రా
- June 10, 2018
నెటిజన్ల ఆగ్రహానికి బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా తలొగ్గింది. భారతీయులకు క్షమాపణ చెప్పింది. క్వాంటికో’ షోలో హిందువులను ఉగ్రవాదులుగా చూపడంపై ప్రియాంక చోప్రా విచారం వ్యక్తం చేసింది. ‘ఇటీవల ప్రసారమైన క్వాంటికో ఎపిసోడ్ భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా ఉండటంపై బాధను వ్యక్తం చేస్తున్నా. ఎవరినో కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలుపుతున్నా. ఒక భారతీయురాలిగా నేను గర్వపడుతుంటాను. ఇది ఎప్పటికీ మారదు’’ అని ప్రియాంక ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది. ఆమెతో పాటు క్వాంటికో’ నిర్మాణ సంస్థ ఏబీసీ, నిర్వాహకులు కూడా క్షమాపణ చెప్పారు.
అమెరికాలో పాపులర్ సీరియల్గా ‘క్వాంటికో’కు పేరుంది. అయితే, జూన్ 1న ప్రసారమైన షోలో భారతీయులను ఉగ్రవాదులుగా చూపించారు. న్యూయార్క్లోని మాన్హట్టన్లో పేలుళ్లకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తారు. వారి కుట్రను ఎఫ్బీఐ అధికారైన ప్రియాంక చోప్రా భగ్నం చేస్తుంది. అయితే ప్రియాంక చోప్రా ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఓ టెర్రరిస్ట్ మెడలో రుద్రాక్షమాల కనిపిస్తుంది. దాని ఆధారంగా వారు ఇండియన్స్ అని నిర్దారణకు వస్తారు. పాకిస్థాన్ టెర్రరిస్టుల ముసుగులో ఇండియన్సే పేలుళ్లకు ప్లాన్ చేశారు అనే విధంగా సీన్లో చూపించారు. ఆ సీన్పైనే భారతీయులు భగ్గుమన్నారు.
‘క్వాంటికో’ షోలో హిందువులను ఉగ్రవాదులుగా చూపడంపై సోషల్ మీడియాలో తీవ్ర దూమారం రేగుతోంది. భారతీయులను ఉగ్రవాదులుగా చూపిస్తుంటే.. భారతీయురాలిగా ఖండించకుండా ఎలా సమర్ధించావంటూ ప్రియాంకను జనాలు తిట్టిపోస్తున్నారు. దీంతో ప్రియాంక స్పందించి క్షమాపణ కోరింది.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







