భారత్పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్..
- June 11, 2018
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికా వస్తువులపై భారత్ 100 శాతం సుంకాన్ని వసూలు చేయడంపై ఆయన మండిపడ్డారు. అమెరికాను దోచుకునేందుకు ప్రయత్నించే దేశాలతో అవసరమైతే వాణిజ్య సంబంధాలను తెంచుకునేందుకు సైతం వెనుకాబడబోమని హెచ్చరించారు. పలు దేశాలు అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వాణిజ్య పన్నులు అధికంగా వసూలు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అందరూ అమెరికానే దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అమెరికా సంపదకు నష్టం వాటిల్లే విధంగా ఉంటే ఇతర దేశాలతో ఉన్న వాణిజ్య సంబంధాలను తెంచుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.
భారత్లో తమ వస్తువులపై వంద శాతం సుంకాన్ని విధిస్తున్నారని, కానీ తాము మాత్రం విధించడం లేదని ట్రంప్ తెలిపారు. తాము అలా వసూలు చెయ్యలేకపోతున్నామన్నారు. అమెరికా నుంచి దిగుమతి అవుతున్నహార్లీ డేవిడ్సన్ బైకులపై భారత్ అధిక శాతం పన్నులు వసూలు చేస్తుందని గతంలో ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా-భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు సంతృప్తికరంగా లేవు. ఈ నేపథ్యంలో మరోసారి ట్రంప్ భారత్ పేరు వాడుతూ కామెంట్స్ చేయడంతో టెన్షన్ నెలకొంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







