భారత్పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్..
- June 11, 2018
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికా వస్తువులపై భారత్ 100 శాతం సుంకాన్ని వసూలు చేయడంపై ఆయన మండిపడ్డారు. అమెరికాను దోచుకునేందుకు ప్రయత్నించే దేశాలతో అవసరమైతే వాణిజ్య సంబంధాలను తెంచుకునేందుకు సైతం వెనుకాబడబోమని హెచ్చరించారు. పలు దేశాలు అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వాణిజ్య పన్నులు అధికంగా వసూలు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అందరూ అమెరికానే దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అమెరికా సంపదకు నష్టం వాటిల్లే విధంగా ఉంటే ఇతర దేశాలతో ఉన్న వాణిజ్య సంబంధాలను తెంచుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.
భారత్లో తమ వస్తువులపై వంద శాతం సుంకాన్ని విధిస్తున్నారని, కానీ తాము మాత్రం విధించడం లేదని ట్రంప్ తెలిపారు. తాము అలా వసూలు చెయ్యలేకపోతున్నామన్నారు. అమెరికా నుంచి దిగుమతి అవుతున్నహార్లీ డేవిడ్సన్ బైకులపై భారత్ అధిక శాతం పన్నులు వసూలు చేస్తుందని గతంలో ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా-భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు సంతృప్తికరంగా లేవు. ఈ నేపథ్యంలో మరోసారి ట్రంప్ భారత్ పేరు వాడుతూ కామెంట్స్ చేయడంతో టెన్షన్ నెలకొంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







